అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన

అర్ధరాత్రి బైక్పై కలెక్టర్‌ పర్యటన - Sakshi


భూపాలపల్లి:

కలెక్టర్‌ మురళి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2.30 గంటల వరకు భూపాలపల్లి నగర పంచాయతీలోని హనుమాన్‌నగర్, శాంతినగర్, ఎస్సీకాలనీ, సుభాష్‌కాలనీ, జంగేడు, సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి, కారల్‌మార్క్స్‌కాలనీ, అంబేద్కర్‌ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై తిరిగారు. ఆయా వార్డులలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను పరిశీలించారు.



కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పట్టణంలో వివిధ దుకాణాలు రాత్రి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయని, గుడుంబా తయారీ, రవాణా జరిగే సమాచారం గురించి ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top