సహపంక్తి భోజనం
హెచ్ఐవీ బాధిత చిన్నారులతో జిల్లా ఎస్పీ సహపంక్తి భోజనం చేశారు. ఎస్సార్బీసీ కాలనీలోని హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరివర్తన లైఫ్ సెంటర్ను ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాసేపు చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. హెచ్ఐవీ బాధిత చిన్నారులకు ఎనలేని సేవలు అందిస్తున్న అబ్రహం లింకన్ దంపతులను ఆదర్శంగా తీసుకొని మరికొందరు ఇలాంటి చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ హరినాథరెడ్డి, లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహం లింకన్, భోజన కార్యక్రమ దాత బ్రహ్మం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- నంద్యాల రూరల్
సంబంధిత వార్తలు