వార్త రాయించేస్తా... ఖబడ్దార్

వార్త రాయించేస్తా... ఖబడ్దార్ - Sakshi


అధికారులను దారిలో తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారం కన్నా పత్రికలనే నమ్ముకున్నారట. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు ఏ స్థాయి అధికారినైనా, ఇతర ప్రభుత్వాధికారులందరినీ తన దారిలోకి తెచ్చుకోవడానికి ఆ చర్య తీసుకుంటామనో లేదంటే మంచి పోస్టింగ్ దక్కనీయమనో హెచ్చరించడం సహజం. కానీ, ఈ సీఎం తన మాట వినని సీనియర్ ఐఏఎస్ అధికారులపై వారికి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాయిస్తానని బెదిరిస్తున్నారట. టీటీడీతో సహా ప్రభుత్వంలో కీలక శాఖలన్నింటిలోనూ ఉన్నతాధికారిగా పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం సరైన బాధ్యతలు అప్పజెప్పకుండా పక్కనబెట్టడంతో ఆయన అసంతృప్తిలో ఉన్న విషయంపై కొన్ని పత్రికల్లో కథనాలొచ్చాయి.



వీటిపై అసహనానికి లోనయిన సీఎం పేపర్లకు లీకులిచ్చి వార్తలు రాయించుకుంటున్నారు, నేనూ మీపై పత్రికలకు ఎక్కాల్సి వస్తుందని అనడంతో ఉన్నతాధికారులు విస్మయం చెందాల్సి వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సీనియర్ అధికారులనుద్ధేశించి పత్రికల్లో వార్తలు రాయిస్తానని బెదిరించడం ఏమిటంటూ సచివాలయంలో అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top