దత్తత గ్రామాల్లో పర్యటించిన కేసీఆర్

దత్తత గ్రామాల్లో పర్యటించిన కేసీఆర్ - Sakshi

జగదేవ్‌పూర్: దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన ఆయన.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.



సీసీ రహదారులు, వాటికి ఇరువైపుల నాటిన మొక్కలతో పాటు చివరి దశలో నిర్మాణంలో ఉన్న ఫంక్షన్ హాల్ పనులను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మైన్ శేరిసుభాష్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top