‘బంగారు తెలంగాణ’లో భాగస్వాములు కావాలి
► మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
► ఐలాపురం, పెన్పహాడలో ‘జలనిధి’పై రైతులకు అవగాహన
చివ్వెంల : బంగారు తెలంగాణ సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. జలనిధి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వాలు చేయలేని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించిందన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. జలనిధి కార్యక్రమంలో భాగంగా రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వించుకోవాలని సూచించారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని గుర్తు చేశారు. ఐలాపురం గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.4 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.సురేంద్రమోహన్, ఆర్డీఓ మోహన్రావు, ఎంపీపీ కల్పగిరి యశోద, జెడ్పీటీసీ రౌతు చొక్కమ్మ, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ బి.పద్మ పాల్గొన్నారు.
భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి
పెన్పహాడ్ : వర్షపు నీటిని ఒడిసిపట్టి భావి తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో జలనిధి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ భూక్య పద్మ, జెడ్పీటీసీ పిన్నెని కోటేశ్వర్రావు, గాయకుడు గోరెటి వెంకన్న, కట్కూరి గన్నారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లుగౌడ్, భిక్షం, ఇంద్రసేనారావు, వెన్న సీతారాంరెడ్డి, వెంకట్రెడ్డి, కృష్ణ, డీఆర్డీఓ పీడీ సుందరి కిరణ్కుమార్, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ పాల్గొన్నారు.