ముద్రగడకు సినీనటి హేమ పరామర్శ

ముద్రగడకు సినీనటి హేమ పరామర్శ - Sakshi


కాకినాడ: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రముఖ సినీనటి హేమ పరామర్శించారు. ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి హేమ చేరుకున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితిని కూడా హేమ ఆరా తీశారు.


ముద్రగడ పద్మనాభం కుటుంబం త్వరగా కోలుకోవాలని హేమ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం ముద్రగడ, ఆయన కుటుంబసభ్యులు 14 రోజులు దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top