మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని


ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని తనపై దాడి చేశారని ఏలూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ మధు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కానిస్టేబుల్ మధుపై దాడి చేసినట్లు సమాచారం.


ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కోల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. అదికూడా ఆటవీశాఖ అధికారుల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top