36 రోజులు.. రూ.2.48 కోట్లు
రికార్డు స్థాయిలో చిన వెంకన్న హుండీ ఆదాయం
ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి జిల్లా): చినవెంకన్నగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి హుండీల ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 36 రోజులకు గానూ రూ.2.48 కోట్లు ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో మంగళవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపేణా రూ.2,48,12,882 రాగా, కానుకల రూపంలో 573 గ్రాముల బంగారం, 7.631 కేజీల వెండి లభించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.