బాలల చేతుల్లో కర్పూరం వెలిగించింది...


లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): దొంగతనం నేరం మోపి.. నిజ నిర్ధారణ కోసమంటూ చిన్నారుల చేతుల్లో కర్పూరం వెలిగించి గాయపరిచిన ఘటన  వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో వెలుగుచూసింది. గ్రామంలోని ప్రజాచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పది మంది బాలురతో ఆర్బీసీ స్కూల్ నడుస్తోంది. ఈ స్కూల్‌లో ఆశ్రయం పొందుతున్న ఓ బాలుడి డబ్బును ఎవరో దొంగిలించారు. ఈ విషయమై స్కూల్ అటెండర్ అన్నపూర్ణమ్మ ముగ్గురు బాలురను అనుమానించింది. 

 

శుక్రవారం సాయంత్రం వారి అరచేతుల్లో కర్పూరం ఉంచి వెలిగించింది. అది కాలితే దొంగతనం చేసినట్లు...లేకుంటే నిజాయితీపరులేనని వారికిపరీక్షపెట్టింది. అయితే,కర్పూరం మంటతోముగ్గురి చేతులకూ కాలినగాయాలయ్యాయి. ఈ విషయంలో బాధితుల తరఫు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సదరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చెన్నారెడ్డికి అధికార టీడీపీ నేతల అండదండలున్నాయని సమాచారం.

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top