బాల్య వివాహన్ని అడ్డుకున్న పోలీసులు
కడప : వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లిలో బుధవారం తెల్లవారుజామున జరుగుతున్న బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పాఠశాలలో10 వ తరగతి చదువుతున్న విద్యార్థినికి కువైట్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తిని ఇచ్చి బుధవారం తెల్లవారుజామున వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు.
దీంతో బాల్య వివాహం నేరం అంటూ స్థానికులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో బాలిక తల్లిదండ్రులతో స్థానికులు ఘర్షణ పడ్డారు. అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే జీకే రాచపల్లి చేరుకుని... బాలిక తల్లిదండ్రులతోపాటు వివాహానికి సిద్ధపడిన 40 ఏళ్ల వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు.