బాల్య వివాహన్ని అడ్డుకున్న పోలీసులు


కడప : వైఎస్ఆర్ జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లిలో బుధవారం తెల్లవారుజామున జరుగుతున్న బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పాఠశాలలో10 వ తరగతి చదువుతున్న విద్యార్థినికి కువైట్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తిని ఇచ్చి బుధవారం తెల్లవారుజామున వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు.


దీంతో బాల్య వివాహం నేరం అంటూ స్థానికులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో బాలిక తల్లిదండ్రులతో స్థానికులు ఘర్షణ పడ్డారు. అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే జీకే రాచపల్లి చేరుకుని... బాలిక తల్లిదండ్రులతోపాటు వివాహానికి సిద్ధపడిన 40 ఏళ్ల వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top