తిరుమలలో చిరుతల సంచారం


తిరుమల : తిరుమల కొండపై చిరుతల సంచారం ఎక్కువైంది. శనివారం రాత్రి తిరుమల కొండపైన ఉన్న ఓ కార్యాలయం గోడపై చిరుత కూర్చున్నట్లు సీసీ టీవీ ఫూటేజిలో రికార్డు కావడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు నివసించే బాలాజీనగర్ సమీపంలో శనివారం రాత్రి చిరుతపులి ఓ దుప్పిని వేటాడిన ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా చిరుతల సంచారం పెరిగినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top