‘చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు’


సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇద్దరు సీఎంలు పిరికిపందల యుద్ధనీతిని అమలు చేస్తున్నారని.. వెంటనే దీన్ని మార్చుకోవాలని హెచ్చరించింది.



మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్ జిల్లాల కార్యదర్శి దామోదర్ పేరుతో శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఏఓబీ ఎన్‌కౌంటర్ బూటకమని, ఇది మావోయిస్టు పార్టీకి నష్టమేనని, కానీ కొద్దిరోజుల్లోనే నిలదొక్కుకుని తిరిగి విస్తరిస్తామని, ప్రజాద్రోహులను ఖతం చేస్తామని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top