‘బడా బాబులపై ఐటీ దాడులు చేయించాలి’
సాక్షి, హైదరాబాద్: నల్లధనం వెలికితీతకు దేశంలో ఉన్న బడా బాబులపై ఐటీ, ఇతర ఏజెన్సీలతో దాడులు చేరుుంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నరసింహ, బాలమల్లేశ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ముఖ్య మంత్రులు, మంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను వదిలిలేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా రని విమర్శించారు. బీజేపీ తలకిందులైనా ఈ పద్ధతిలో నల్లధనం వెలికితీతలో విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.