నల్లగొండలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన
చౌటప్పల్ : నల్లగొండ జిల్లాలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం పర్యటించారు. మర్రిగూడ మండలంలో ఫ్లోరైడ్ బాధితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం చౌటప్పల్లో జరిగే చేనేత కార్మికుల సమావేశంలో నడ్డా పాల్గొననున్నారు.