కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు


కరీంనగర్: హుజూరాబాద్ లో శుక్రవారం ఓ కారు బోల్తా పడింది. పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిని వారిని స్ధానికులు ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన కారు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top