మొర్రువానిగూడెంలో బకెట్ బాంబులు
వెంకటాపురం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం మొ ర్రువానిగూడెం ర్యాంపు సమీపంలో మావోయిస్టులు బకెట్ బాంబులు పెట్టారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో 40మందికి పైగా మావోలు గొత్తికోయలతో కలిసి ఈ బాం బులు అమర్చినట్లు తెలిసింది. దాదాపు 2 గంటల పాటు వాహనాలను ఆపి హల్చల్ చేసినట్లు సమాచారం.
రాత్రి సమయంలో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం వచ్చే బస్సును, వరంగల్ డిపో నుంచి భద్రాచలం వెళ్లే బస్సులను ఆపి ప్రయాణికులను సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. బకెట్ బాంబులు పెట్టి రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టి వారోత్సవాలను విజయవంతం చేయా లని కరపత్రాలు వేసి బస్సులను వెనక్కు పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రాంతం లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.