రూ.49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

రూ.49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌

డాబాగార్డెన్స్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు మరింత విస్తతం చేయనున్నట్టు సంస్థ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ నళినీ వర్మ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు టెండర్ల స్టేజీలో ఉందని ఆమె వెల్లడించారు.  సరికొత్త ల్యాండ్‌లైన్‌ ప్లాన్‌తో పాటు కొత్త ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్‌కు సంబంధించి ఆమె మంగళవారం డాబాగార్డెన్స్‌ కార్యాలయంలో పోస్టర్‌ ఆవిష్కరించారు.  కొత్త ప్లాన్‌కింద కేవలం రూ.49లకే కొత్త ల్యాండ్‌లైన్‌ కనెక్షన్, ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ అందిస్తున్నట్టు చెప్పారు. టెలిఫోన్‌కు మాత్రం రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్లాన్‌లో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉచిత నైట్‌కాలింగ్‌ సదుపాయం ఉంటుందని, ఆదివారాల్లో కూడా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్‌ చేసుకోవచ్చని తెలిపారు.  ఈ ఆఫర్‌ ఆగస్టు 15 నుంచి 90 రోజుల వరకు మాత్రమే ఉంటుందని వివరించారు.  రూ.470లకే రెంట్‌ ఫ్రీల్యాండ్‌లైన్, ఫ్రీ నైట్‌ కాలింగ్‌(అన్ని నెట్‌వర్క్‌లకు) రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటలకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం అపరిమిత ఉచిత కాలింగ్, సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు, ఉచిత ఇన్‌స్టాలేషన్, బంధం స్కీం ద్వారా  రోజూ ల్యాండ్‌లైన్‌కు 20 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు సమీపబీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో, లేదా టోల్‌ఫ్రీ నెంబరు 18003451500 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top