ధైర్యవంతులే విజేతలు

ధైర్యవంతులే విజేతలు - Sakshi

  • యువత ఆత్మవిశ్వాసంతోముందుకుసాగాలి

  • సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ

  • తొర్రూరు : కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రామ ఉపేందర్‌ గార్డెన్‌లో సమత డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి కళాకారుడు తన నైపుణ్యాన్ని పెంచుకుంటే దేవుడు సైతం అతడి కోసం వెతుక్కుంటూ వస్తాడన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి అతి తక్కువ సమయమే అవుతున్నందున.. సమస్యల పరిష్కారం కోసం వేచిచూడాలే తప్ప ధిక్కారాన్ని ప్రదర్శించడం సరికాదని సుద్దాల అభిప్రాయపడ్డారు. అవమానాలు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగే వారే జీవితంలో విజేతలుగా నిలుస్తారన్నారు. నేటి యువత అటువంటి తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అనంతరం సీఐ శ్రీధర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నైతిక విలువలు పెంపొందించుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. అనంతరం అశోక్‌తేజ, సీఐ శ్రీధర్‌రావులను కార్యక్రమ నిర్వాహకులు సత్కరించా రు. సమావేశంలో కళాశాల కరస్పాండెంట్‌ కోట రఘునాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వెంకటనారాయణ, డైరెక్టర్లు రాజేందర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, నర్సింహారెడ్డి, రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top