ఈతకు వెళ్లి బాలుడి మృతి
నెక్కొండ మండలం చల్లా గోదాముల సమీపంలో ఉన్న ఓ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మహ్మద్ రియాజ్ మోబిన్(14) అనే బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నాం జరిగినా ఆలస్యంగా బుధవారం మధ్యాహ్నాం వెలుగులోకి వచ్చింది. మోబిన్తో పాటు గఫూర్, తాజుద్దీన్ అనే మరో ఇద్దరు బాలురు ఈతకు వెళ్లినట్లు తెలిసింది. మోబిన్ బావిలో మునిగిపోవడంతో మిగతా ఇద్దరు భయంతో పరారైనట్లు తెలిసింది. బుధవారం మిగతా ఇద్దరు తమ కుటుంబసభ్యులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.