డెంగీతో బాలుని మృతి
వలేటివారిపాలెం : డెంగీతో బాధపడుతున్న బాలుడు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బడేవారిపాలెంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉన్నం దీపక్(12) జ్వరంతో బాధపడుతున్నాడు. తండ్రి శ్రీనివాసరావు హైదరాబాద్లోని బీఎస్న్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. బాలునికి డెంగీ జ్వరం అక్కడే సోకింది. వైద్యశాలలో వైద్యం చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బాలుని తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామం బడేవారిపాలెం తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.