రైల్వే కార్మికులకు దసరా బోనస్‌..!


రామగుండం: దసరా పండుగను పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78రోజుల వేతనాన్ని ప్రొడక్టివిటీ లింక్‌డ్‌ బోనస్‌ (పీఎల్‌బీ)గా చెల్లించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది రైల్వేశాఖ నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా వివిధ కార్మిక సంఘాల విన్నపం మేరకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. గతేడాది చెల్లించిన దసరా బోనస్‌ రూ.8,975 వేలు కాగా.. ప్రస్తుత ఏడాది దానిని రూ.18వేలు చేయాలనే కార్మిక సంఘాల డిమాండ్‌ చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఓ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. దీంతో  రైల్వేలో పనిచేస్తున్న 12లక్షల  మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top