'ప్రశ్నించకూడదనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలు'
గుంటూరు : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసినా టీడీపీ పనిగట్టుకుని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిరుమామిళ్ల అశోక్ అన్నారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చినా ఎక్కడా ఒక్క ఎకరం కూడా చదును చేయలేదని ఆయన విమర్శించారు.
బీజేపీ ఏపీలో బలపడకూడదని టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ప్రశ్నించడానికి వీల్లేకుండా ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని అశోక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.