విద్యాశాఖ కార్యాలయాల్లోనూ బయెమెట్రిక్‌


 

– వచ్చే నెల 1 నుంచి ఈ–హాజరు తప్పని సరి

 

కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల ప్రవేశ పెట్టిన బయెమెట్రిక్‌ ద్వారా ఈ–హాజరు నమోదు చేస్తున్నట్లుగానే, విద్యాశాఖ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ తరపున నరసింహారావు ఆర్‌.సీ నెంబర్‌ 58 బుధవారం జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంతో పాటు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీల్లోను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30వ తేదిలోపు బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేసుకుని, వచ్చే నెల 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top