ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు - Sakshi


డీఎంహెచ్‌వో జలపతినాయక్‌

కడెం(ఖానాపూర్‌): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకుంటే ప్రభుత్వం అందించే రూ. 12 వేలు, పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్లతో పాటు మరెన్నో ప్ర యోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మానస, సీడీపీవో విజయలక్ష్మి, అంగన్‌వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. దస్తురాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగామణి వైద్యాధికారి హారిక, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ చిత్రకళ, అంగన్‌వాడీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top