రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి


అనంతపురం న్యూసిటీ: రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని గుంతకల్లు రైల్వే డివిజినల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ హాల్‌లో భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాహనదారులు రైలు గేట్‌ క్రాస్‌ చేసే సయమంలో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని ముందుకెళ్లాలన్నారు.  కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ తిప్పానాయక్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top