రోడ్డుప్రమాదంలో 5 నెలల బాలుడి మృతి


 తూప్రాన్ మండలం బైపాస్ రోడ్డు మార్గంలో పెద్దచెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వారిని టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 నెలల పసి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మేనమామ, అమ్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో ఇస్లాంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top