ఆటో బోల్తా: 8 మందికి గాయాలు
ఆమనగల్లు: మండలంలోని మేడిగడ్డతండా గేటు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ రామలింగారెడ్డి కథనం ప్రకారం.. ఆమనగల్లు నుంచి వెల్దండ మండలం గొల్లోనిపల్లికి ఎనిమిది మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆటో మేడిగడ్డ తండా గేటు వద్ద ముందు ఉన్న ట్రాక్టరును ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో నెమలిగుండుతండాకు చెందిన సీత్యానాయక్, మర్రిగుండుతండాకు చెందిన నరేశ్, చౌదర్పల్లికి చెందిన లచ్చయ్య, జయమ్మ, రాఘాయిపల్లికి చెందిన మణెమ్మ, పెద్దతండాకు చెందిన రాజు, డ్రైవర్ రామచంద్రి, గొల్లోనిపల్లికి చెందిన శ్రీరాములుగౌడ్ గాయపడ్డారు. వీరందరినీ ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న సీత్యానాయక్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.