రేస్క్లబ్పై అధికారుల దాడులు
చాదర్ఘాట్: మలక్పేటలోని హైదరాబాద్ రేస్ క్లబ్లో బుకీలపై వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం దాడులు నిర్వహించారు. వారి నుంచి రూ.7 లక్షల నగదు, చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో రూ.52 లక్షలు పన్ను కట్టాల్సి ఉండగా రూ.7 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తేలింది. పన్నుఎగవేతకు పాల్పడిన 21 మందిపై కేసు నమోదు చేయటంతోపాటు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్య పన్నుల అధికారి రేవతి తెలిపారు.
సంబంధిత వార్తలు