ఏటీఎం కార్డులను తస్కరించి..
కామారెడ్డి (నిజామాబాద్) : ఏటీఎం కార్డులు దొంగిలించి ఖాతాల్లో నుంచి డబ్బులు తస్కరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పరిధిలో పలువురి నుంచి ఏటీఎం కార్డులను దొంగిలించి వారికి తెలియకుండా వారి అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేశారు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.