విశాఖలో ‘ ఏషియన్‌ పనోరమ ఫిలిం ఫెస్టివల్‌’

విశాఖలో ‘ ఏషియన్‌ పనోరమ ఫిలిం ఫెస్టివల్‌’ - Sakshi

సీతంపేట: నగరంలో ఆగస్టు 1 నుంచి ఐదు రోజులపాటు ‘ఏషియన్‌ పనోరమ ఫిలిం ఫెస్టివల్‌’ నిర్వహించనున్నట్టు వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు అన్నారు. ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది దేశాల నుంచి సేకరించిన 9 ఉత్తమ సినిమాలను ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రదర్శిస్తారని తెలిపారు. ఫెస్టివల్‌ ప్రారంభ చిత్రంగా 1వ తేదీన దక్షిణ కొరియా చిత్రం ‘ది వే హోమ్‌’, ఖజకిస్తాన్‌కి చెందిన ‘ఓల్డ్‌మేన్‌’ చిత్రాలు ప్రదర్శిస్తామన్నారు. 2వ తేదీన ఇండియా ఆస్కార్‌ చిత్రం కోర్టు, నేపాల్‌కు చెందిన హిమాలయ, 3న పాకిస్థాన్‌కు చెందిన రామచంద్‌ పాకిస్థాన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన జనరల్‌ లూనా, 4న జపాన్‌కు చెందిన డిపార్చర్స్, వియత్నాంకు చెందిన త్రీ సీజన్స్, 5న చైనాకు చెందిన ది ప్లవర్‌ ఆఫ్‌ వార్‌ చిత్రాలు ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top