జస్టిస్‌ పీసీ రెడ్డి అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం


కడప కల్చరల్‌ : జస్టిస్‌ పీసీ రెడ్డి ట్రస్టు అవార్డు 2016కు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంస్థ ప్రతినిధి పాలెం మల్లికార్జునరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన స్త్రీలు, యువతులు మాత్రమే ఈ అవార్డులకు అర్హులని ఆయన తెలిపారు. న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక శాస్త్రం, క్రీడారంగం, సాంస్కృతిక రంగం (సంగీతం, నృత్యం)లలో ప్రతిభ గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఎంపికైన వారికి రజిత పతకంతోపాటు రూ. 40 వేల నగదు పారితోషికం ఇస్తామన్నారు. దరఖాస్తులను తమ కళాశాల అధినేతల ద్వారా పంపుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడినట్లు సర్టిఫికెట్‌ జతపరచాలన్నారు. దరఖాస్తులను పాలెం మల్లికార్జునరెడ్డి, డోర్‌నెం. 1–752–1, ద్వారకానగర్, కడప–516004 చిరునామాకు పంపాలని, ఇతర వివరాలకు 98855 55182 నెంబరులో సంప్రదించాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top