'కల్లు తాగిన కోతిలా కేసీఆర్'
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి
ఆత్మకూరు రూరల్ : ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణ కోర్టుల్లో నియమించరాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లు తాగిన కోతిలా మాట్లాడటం సబబు కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులు పనిచేస్తోన్న విషయం కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. విభజన చట్టం మేరకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హైకోర్టు ఉంటుందని, అనవసరంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్డడం కేసీఆర్కు తగదని ఈ సందర్భంగా ఆయన సూచించారు.