భూ సేకరణపై వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్

భూ సేకరణపై వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ - Sakshi


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రతిపక్షంతో పాటు, రైతులు ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్కార్లో గుబులు మొదలైంది. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేమని మంత్రులు ...తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయా గ్రామాల్లో  భూ సేకరణ నోటిఫికేషన్లు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం... జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు సమాచారం.



కాగా భూసేకరణ తమ అభిమతం కాదని.. అనివార్య పరిస్థితుల్లోనే భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేశామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. గ్రామ కమతాల విషయంలో అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. ముందు నుంచి భూ సేకరణకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. మిగతా భూమిని కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారానే సేకరిస్తామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top