పదిశాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది శాఖల్లో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించే విషయం గురించి చర్చించారు. భోగాపురం, గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల నిర్మాణానికి హడ్కో నుంచి 800 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు రెండు దశలో భూసేకరణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.