రేపటి బంద్ని జయప్రదం చేయండి
అనంతపురం : రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం శనివారం జరగబోయే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శనివారం జరగబోయే బంద్ను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలంటే బంద్ను జయప్రదం చేయాలని అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ క్యాడర్కు సూచించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ శనివారం చేపట్టే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి పట్టణంలో ఉన్న వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీగా వచ్చారు. రేపు తలపెట్టిన బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.