అనంతలో కలాంకు వైఎస్ఆర్ సీపీ నివాళి


అనంతపురం: మాజీ రాష్ట్రపతి అబ్దూల్ కలాంకు అనంతపురం వైఎస్పార్ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలాం సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు కొనియాడారు. దేశానికి అబ్దూల్ కలాం మృతి తీరని లోటు అని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యాక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, మాజీ ఎంపీ అనంతరామిరెడ్డి, ఉరవ కొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top