స్పీకర్‌ కోడెలపై ఈసీకి ఫిర్యాదు: అంబటి


హైదరాబాద్‌ : ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుపెట్టినట్లు ఓ చానల్‌లో స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు ప్రకటించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో  అంబటి బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ భన్వర్‌లాల్‌ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేసిన స్పీకర్‌ కోడెలపై సుమోటోగా చర్యలు తీసుకుని ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలని అంబటి కోరనున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top