'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది'

'అమరావతికి స్థాన, వాస్తు బలం ఉంది' - Sakshi


నారావారిపల్లె: అమరావతికి స్థాన, వాస్తు బలం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 'మన మట్టి-మన నీరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం చేస్తామన్నారు.



రాజధాని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో 'మన మట్టి-మన నీరు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పవిత్ర భావనతో, అందరి మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీరుతో పాటు సంకల్ప పత్రాలు సేకరిస్తామని వెల్లడించారు. అందరి సంకల్పంతో రాజధాని కట్టుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top