సిద్దవటం కోటను సందర్శించిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు

సిద్దవటం కోటను సందర్శించిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు


సిద్దవటం:   సిద్దవటంలోని మట్లిరాజుల కోటలో శిల్పసంపద చాలా బాగుందని హైదరాబాద్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారి డీఎల్‌ సింగ్‌ అన్నారు.  కడపలో జరిగిన ఎయిర్‌ ఫోర్స్‌ ర్యాలీకి వచ్చిన అధికారులు శుక్రవారం సిద్దవటంలోని మట్లిరాజుల కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వారు కోట ముఖద్వారం, మొదటి, రెండవ మండపాలు, ఈద్గా, పార్కు, శిలాశాసనం, మూతి విరిగిన నంది విగ్రహం, తవ్వకాల్లో బయటపడిన శివలింగం,  కామక్షమ్మ గుడి, బిస్మిల్లా షావలి దర్గా, పెన్నా నది లోకి వెల్లే సొరంగ మార్గం, రాణీ మహాల్‌ వంటి కట్టడాలను వారు తిలకించారు.  అనంతరం వారు మాట్లాడుతూ కోటలో రోడ్లు లేవని, పర్యాటకులు వస్తే  సేద తీర్చుకునేందుకు అక్కడక్కడ సిమెంటు కుర్చీలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, స్టాల్స్‌ వంటి సదుపాయాలను  ఏర్పాటు చేస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో కోటను సందర్శించేందుకు వస్తారన్నారు.

 

 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top