చెరువులో పడి వ్యవసాయ విద్యార్థి మృతి


త్రిపురారం: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ శివారులోని చిన్న చెరువులో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో బక్వాడ పవన్ (21)డీఎస్సీ అగ్రికల్చర్ ఫైనలియర్ చదువుతున్నాడు. రైతులకు వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి నిన్న(గురువారం) సుమారు 35 మంది విద్యార్థులు త్రిపురారంలోని కృషి ఉద్యాన కేంద్రానికి వచ్చారు. శిక్షణలో భాగంగా ఏడుగురు విద్యార్థులు కంపసాగర్ వెళ్లారు. అందులో పవన్, సురేష్ అనే ఇద్దరు విద్యార్థులు స్నానం చేయడానికి చిన్నచెరువులోకి దిగగా ప్రమాదవశాత్తూ పవన్ మునిగి చనిపోయాడు. సురేష్ ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సంఘటనాస్థలాన్ని ఎస్‌ఐ యాలాద్రి, ఎమ్మార్వో, తహశీల్దార్ పరిశీలించారు. మృతుడు పవన్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా గుడహల్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top