ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్

ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ - Sakshi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ ఏసీబీ వలలో చిక్కారు. డీఈడీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించడం కోసం కాలేజ్ యాజమాన్యాల నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ. 1000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top