ఒకరి ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్!


కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి యత్నించిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని కమలాపూర్ మండలం కానిపర్తిలో శనివారం ఉదయం సంభవించింది.


వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన దామెర రమేష్(45) బావమరిది నిశ్చితార్థంకు కానిపర్తికి వచ్చాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌కు  ఛార్జింగ్ పెట్టడానికి యత్నించగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రమేష్ అని పోలీసులు తెలిపారు. రమేష్ హఠాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top