డెంగీతో బాలిక మృతి
మహానంది(కర్నూలు): డెంగీతో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మలపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది.
వివరాలు.. గ్రామానికి చెందిన తేజస్విని(7) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది.