ఎనిమిది గంటల్లో శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 46,040 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలోని భక్తులకు 8గంటలు, 9 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.04 కోట్లు లభించాయి.