19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం


బద్వేల్ (వైఎస్సార్‌ జిల్లా) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా బద్వేల్ మండలం పెద్దచెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు నెల్లూరుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కడప జిల్లా వాసులని  పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top