భద్రాచలంలో కార్డన్ సెర్చ్


భద్రాచలం: భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీలో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, సుమారు 50మంది సిబ్బంది కాలనీని చుట్టుముట్టి ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.



ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 50 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top