డ్రై వర్‌పై దాడి కేసులో నలుగురి అరెస్టు


అమలాపురం టౌన్‌ :

ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్‌పై అదే కళాశాలకు చెందిన విద్యార్థితో పాటు ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈనెల 14న అమలాపురం ఈదరపల్లి వంతెనపై శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్‌ గుండుబల్లి శ్రీనివాస్‌పై అమలాపురానికి చెందిన అదే కళాశాల విద్యార్థి విత్తనాల అజయ్‌కుమార్, అతడి స్నేహితులు కోటిపల్లి నాగమల్లేశ్వరరావు, భీమవరపు ఏసుప్రసాద్, దొంగ బాలాజీ దాడి చేసి గాయపరిచారని పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తెలిపారు. కళాశాలలో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో విద్యార్థి అజయ్‌కుమార్‌ గొడవ పడ్డాడని, ఆ కోపంతో ఈదరపల్లి వంతెన వద్ద డ్రైవర్‌ను అడ్డగించి, దాడి చేసి గాయపరిచారని సీఐ చెప్పారు. దాడికి పాల్పడిన నలుగురినీ ఆదివారం అరెస్టు చేసినట్టు తెలిపారు.

 

 

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top