31 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చిదిమెళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా 31 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షల నగదుతోపాటు 29 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు