రెండు బస్సులు ఢీ

రెండు బస్సులు ఢీ - Sakshi


30 మంది ప్రయాణికులకు గాయాలు

రామాయంపేట వద్ద ఘటన

ఇద్దరు డైవర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదం

తృటిలో తప్పిన ప్రాణాపాయం


రామాయంపేట: పట్టణ శివారులో జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాందేడ్ వెళుతున్న మహారాష్ట్రకు చెందిన బస్సును బైపాస్ రోడ్డు వద్ద డ్రైవర్ ఒక్కసారిగా  రామాయంపేట వైపు తిప్పాడు. దీంతో హైదరాబాద్ వైపు వేగంగా వెళుతున్న నిజామాబాద్ సూపర్ డీలక్స్ బస్సు దాన్ని ఢీకొంది.  నిజామాబాద్ డిపో బస్సు వేగంతో మహారాష్ట బస్సును ఢీకొని రోడ్డుపై కొద్ది దూరం నె ట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న 30 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.


ఈ ప్రమాదంలో నిజామాబాద్‌కు  చెందిన గంగమణి, ప్రశాంత్, ఎలిజబెత్, డి.స్వామి, హరికుమార్, రాఘవులు, ఖతీజాతోపాటు విద్యార్థినులు భావన, రవళి ఉన్నారు. ఈ ప్రమాదంలో అదే జిల్లాలోని డిచ్‌పల్లికి చెందిన గోదావరి, బస్వాపూర్‌కు చెందిన ప్రియాంక, ధర్‌పల్లికి చెందిన వినోద్‌కుమార్, జిల్లాలోని రామాయంపేట మండలం డీధర్మారం గ్రామానికి చెందిన కర్రోళ్ల నర్సవ్వ, మిర్‌దొడ్డి మండలం కొండాపూర్‌కు చెందిన గుండం వెంకట్రాంరెడ్డి, ఆయన భార్య వెంకటమ్మ, హైదరాబాద్‌కు చెందిన హబీబ్, డి. నర్సింలు, కే రాములు, ఆయన భార్య జమున, మహారాష్ట్ర బస్సు కండక్టర్ రమేశ్, ఆ రాష్ట్రానికే చెందిన సదానంద్ గాయపడ్డారు.


కాగా ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మరో పది మంది వరకు ప్రయాణికులు ఇతర వాహనాల్లో వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. కాగా రెండు బస్సుల డ్రైవర్ల నిర్లక్ష ్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగగా, పోలీసులు క్రమబద్ధీకరించారు. స్థానిక సీఐ నందీశ్వర్‌రెడ్డి, రామాయంపేట, చిన్నశంకరంపేట ఎస్‌ఐలు ప్రకాశ్‌గౌడ్, నాగేశ్ బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top