రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం
బెస్తవారిపేట: ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు ఎగిసిపడి ముగ్గరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన బెస్తవారిపేట మండలంలోని కలగుట్ల వద్ద చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్నా కారును ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే కారులో పెద్ద ఎత్తున వ్యాపించడంతో.. మంటల్లో చిక్కుకొని అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.